బాలినేని సీటు మార్పు, టీడీపీ సీట్లలో కొత్త లెక్కలు - జగన్ మార్క్ మార్పులు..!!
ముఖ్యమంత్రి ఎన్నికలకు కొత్త లెక్కలతో బరిలోకి దిగుతున్నారు. గెలుపే ప్రామాణికంగా..సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ బలం పెరిగిందని భావిస్తున్న సీట్లలో అనూహ్య మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 38 ఇంఛార్జ్ ల మార్పులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ మార్పుల పైన కసరత్తు తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.
అనూహ్య నిర్ణయాలతో: ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం అయింది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తు తో సీఎం జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం పైన సుదీర్ఘంగా కసరత్తు జరుగుతోంది. తొలి విడత జాబితాలోనే మంత్రులు సురేష్, నాగార్జునలకు ప్రకాశంలో సీట్లు ఖరారు చేసారు.

ఇక, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. ఒంగోలు తో సహా మిగిలిన నియోజకవర్గాల్లో మార్పుల పైన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయ సాయిరెడ్డి జిల్లాకు చెందిన నేతలు బాలినేని, మాగుంటతో సహా పలువురితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. చివరకు అందరిని మార్పులకు ఒప్పించినట్లు తెలుస్తోంది.
మార్పులు - చేర్పులు: ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరు నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని పైన బాలినేనితో చర్చలు జరుగుతున్నాయి. బాలినేని అందుకు అంగీకరిస్తే ఒంగోలు నుంచి సిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కనిగిరి నుంచి పోటీ చేయించే విధంగా కసరత్తు జరుగుతోంది.
ఒంగోలు ఎంపీగా బీసీ వర్గానికి కేటాయించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బుర్రా మధుసూధన్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు నెల్లూరులోనూ అభ్యర్దుల ఖరారు పైన విజయ సాయిరెడ్డి ప్రాధమిక కసరత్తు పూర్తి చేసారు. జగన్ వద్ద నేడు ఈ జిల్లాకు సంబంధించి నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

కొత్త సమీకరణాలు: నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఆయన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మూడు సీట్ల మార్పు పైన సూచనలు చేసారు. దీని పైన నేరుగా సీఎం జగన్ తోనే చర్చలు చేసారు. నెల్లూరు జిల్లాలో గూడూరు అభ్యర్ది ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఎమ్మెల్సీ హమీ ఇచ్చి..ఆ స్థానం నుంచి ఒక మాజీ అధికారిని బరిలోకి దింపాలనేది ఆలోచనగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ మేరుగ మురళికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉంది.
నెల్లూరు సిటీ టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో..సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు తిరిగి వైసీపీ సీటు ఖరారైంది. ఈ రోజు లేదా రేపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభ్యర్దుల జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications