Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ నా ధైర్యం, దళారులు నాకు వద్దు: వాళ్లు చంద్రబాబు కోవర్టులు- జగన్..!!

మీ బిడ్డకు దళారులు అవసరం లేదు. మీ బిడ్డ నమ్మేదల్లా చేసిన మంచినే..అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని సీఎం పేర్కొన్నారు.

కురుక్షేత్ర యుద్దం : త్వరలో కురుక్షేత్ర యుద్దం జరగనుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడు. కలిసే మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. ఇదే దత్తపుత్రుడు ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అని చెప్పారని గుర్తు చేసారు. వీరు సరిపోరని మోదీని కూడా కలుపుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా అని ప్రశ్నించారు. తన పాలనలో ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదని వివరించారు.

CM Jagan Targets Oppostion in Macharla public meeeting, inuguarates Varikapudisela lift Scheme

ఇదీ మన ధైర్యం : మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం తమదని జగన్ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నామన్నారు. పొత్తులను తాము నమ్ముకోలేదన్నారు. తన ధైర్యం ప్రజలు.. అందుకే మధ్యలో దళారుల్ని పెట్టుకోలేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. తన ధైర్యం ఇంటింటికీ చేసిన మంచి, అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు చేసిన మంచే తన ధైర్యంగా వివరించారు.

మనందరి ప్రభుత్వం బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించిన రూ.2.40 లక్షల కోట్లే నా ధైర్యం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ వ్యవస్థలో...ప్రతీ పార్టీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. వీరంతా తమ పార్టీల కోసం కాకుండా చంద్రబాబు కోసం రాజకీయాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు.

CM Jagan Targets Oppostion in Macharla public meeeting, inuguarates Varikapudisela lift Scheme

దళారులు అవసరం లేదు : గతంలో చేసిన మోసాల తరహాలోనే మరోసారి 11 హామీలతో ప్రతిపక్షాలు మరోసారి ప్రజలను వంచించేందుకు వస్తున్నారని జగన్ అప్రమత్తం చేసారు. ఇలాంటి రాజకీయం,.పొత్తులు తనకు చేతకాదని చెప్పారు.వైఎస్సార్. జగన్ కు తెలిసింది ఒక్కటేనని..ప్రజల్లో నడవటం.గుండె చప్పుడు వింటమే..నేను విన్నాను. నేను ఉన్నాను అని చెప్పటమేనని వివరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ మాటను అమలు చేస్తాడని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు కుమారుడికి తెలుగులో మాట్లాడటం రాదని..ఇంగ్లీషు గురించి చెప్పే పని లేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబు తన బినామీల భూముల ధరలు పెరగాలని అమరావతిని రాజధానిగా భ్రమ కలిగించారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మూడు ప్రాంతాలకు సమన్యాయం చేశారా అని జగన్ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+