అసెంబ్లీ తీర్మానంపై ప్రధానికి కిరణ్ రెడ్డి లేఖ: ఆనం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఉద్యోగులు ముఖ్యమంత్రి కోరినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. సమైక్యవాదం ఒక్కటే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు ఆయన చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు సఫలమయ్యాయని, వారు విధుల్లో చేరుతున్నారని ఆయన చెప్పారు. సమ్మె కాలంలో వేతనం గురించి చర్చలు జరగలేదని, మంత్రి వర్గ ఉప సంఘం వారితో ఇతర విషయాలపై చర్చిస్తుందని ఆయన చెప్పారు.
సమైక్యాంధ్రకు తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇదివరకు తీర్మానం చేసి కాంగ్రెసు అధిష్టానానికి, ప్రధానికి పంపించామని, తాము దానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా దానికే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతకు మించి మరో నిర్ణయం తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులమంతా సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని ఆనం చెప్పారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, వామపక్షాలు, బిజెపిలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయని, అయితే గతంలో చెప్పిన అభిప్రాయాలపై పునరాలోచన చేస్తున్నాయని ఆయన అన్నారు. విభజనకు అనుకూలమనో, ప్రతికూలమనో చెప్పే స్థితిలో రాజకీయ పార్టీలు లేవని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.
ఐటిఐఆర్, విభజనకు సంబంధం లేదని, ఐటిఐఆర్ ప్రతిపాదన ఇప్పటిది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు పాటించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ పాటించాలని ప్రధానికి, కేంద్ర హోం శాఖకు లేఖలు రాస్తానని ఆయన ఎపిఎన్జీవోలతో చెప్పారు. ఉద్యోగ సంఘాలు కలుసుకునే అవకాశం జివోఎం ఇవ్వాలని, ఉద్యోగ సంఘాలకు ఇవ్వకపోతే తాము కూడా కలవబోమని ఆయన చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications