వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉషకు సీఎం జగన్ ఫోన్...
విప్లవ భావాలను తన పాటలతో తూటాలుగా పేల్చిన ప్రముఖ కవి,ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం(అగస్టు 5) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసాదరావు కుమార్తె ఉషను ఫోన్లో పరామర్శించారు.వంగపండు మృతితో ఓ ప్రజా గాయకుడిని కోల్పోయామన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ, కల్చరల్ కమిషన్కు ఉష చైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 77 ఏళ్ల ప్రసాదరావు విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 1943లో జన్మించిన ఆయన ఉత్తరాంధ్ర జానపద శైలిలో పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన ఆయన విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్గా పనిచేస్తూనే ప్రజా ఉద్యమాల్లో తన పాటను వినిపించారు. తర్వాతి కాలంలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం ఉద్యమాలకే వెచ్చించారు. ప్రజా యుద్ద నౌక గద్దర్తో కలిసి జననాట్య మండలితో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన స్వయంగా రాసి,పాడిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. ఏం పిల్లో ఎల్దమొస్తవా.. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications