పవన్ పై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు, ఓట్లు అమ్ముకొనే వ్యాపారి..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. యూజ్ అండ్ త్రో పవన్ సిద్దాంతంగా వ్యాఖ్యానించారు. అభిమానులు ఓట్లు హోల్ సేల్ గా అమ్ముకోవడానికి దత్త పుత్రుడు అప్పుడప్పుడు వస్తారని ఎద్దేవా చేసారు. దత్తపుత్రుడు ఇంట్లో ఇల్లాలు మూడు నాలుగు ఏళ్ల కి మారిపోతుందని పేర్కొన్నారు. సొంత వర్గాన్ని,పార్టీ ను అమ్ముకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు.మన కాపులు, ప్రజలు కి దత్త పుత్రుడు వంటి వ్యక్తి మీద ఎలా ప్రేమ ఉంటుందని సీఎం జగన్ ప్రశ్నించారు.
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు : ముఖ్యమంత్రి జగన్ దత్తపుత్రుడు అంటూ పవన్ పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటుందని..కానీ, ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకు ఒకసారి మారిపోతారని చెప్పుకొచ్చారు. ఒక సారి లోకల్..ఒకసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేసారు. ఏపీలో దోచుకోవటం..హైదరాబాద్ లో పంచుకోవటం అలవాటు అయిందన్నారు.

చంద్రబాబు..దత్త పుత్రుడు ఏపీలో ఉండరని..ఆయన కుమారుడు..ఆయన బామ్మర్ది ఉండంటూ లోకేశ్..బాలయ్య గురించి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎప్పుడైనా నెల రోజులైనా ఏపీలో కనిపించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా చంద్రబాబు పేదలకు మేలు చేయలేదని మండిపడ్డారు.
ఓట్లు అమ్ముకొనే వ్యాపారి : దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో వ్యాపారానికి వస్తాడని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ప్యాకేజీ స్టార్ కి పోటీ చేసి ఓడిపోయిన భీమవరం తో సంబంధము లేదు.. గాజువాక తో అనుబంధం లేదని వ్యాఖ్యానించారు.సరుకులు..సరంజామా అమ్ముకొనే వాళ్లను చూసాము..కానీ, సొంత పార్టీని..వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదని వ్యాఖ్యానించారు. వాడుకోవడం, వదిలేయడంగానే నియోజకవర్గాలనూ ఆయన భావిస్తాడు అని జగన్ మండిపడ్డారు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరని మండిపడ్డారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏరోజు పేదల కోసం ఆలోచన చేయలేదన్నారు.

సొంతింటి కల నేరవేర్చాం : సామర్లకోటలలో ఇళ్లు ప్రారంభించిన సీఎం జగన్ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పారు. డేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications