చంద్రబాబు ఆదేశాలు, తిరుపతి, చిత్తూరు కలెక్టర్లకు ఆ బాధ్యతలు, రికార్డులు ఉన్నాయా ?
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దుండగులు రికార్డులు కాల్చిన ఘటనపై మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి ఈ ఘటనపై లోతుగా విచారించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలోని అధికారులు ఒక్కొక్కరు మదనపల్లె చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై లోతుగా విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ మదనపల్లె చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరిపి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు సుమిత్కుమార్, వెంకటేశ్వర్లు కూడా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఇద్దరు కలెక్టర్లకు సిసోడియా కీలక విచారణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఇద్దరూ తమకు అప్పగించిన బాధ్యతల్ని అమలు చేయడం ప్రారంభించినట్లు సమాచారం. జిల్లాల విభనజకు ముందు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవి. దీంతో పుంగనూరు నియోజకవర్గ రికార్డులు ఇంకా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఉండే అవకాశాలున్నాయని సమాచారం.
జిల్లాల విభజన తరువాత పుంగనూరు, కుప్పం, పలమనేరు అసెంబ్లీ నియోజక వర్గాలు చిత్తూరులో కలిశాయి. అప్పటి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గాలు అన్నమయ్య జిల్లాలో కలిశాయి. మదనపల్లెను జిల్లా కేంద్రం కాకుండా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు అప్పటి మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం, డీస్పీ బంగ్లా, ఎంతో పేరు ఉన్న బీటీ కాలేజ్, ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలు ఉన్నాయని, ఎలాంటి సదుపాయాలు లేని రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించకూడాదని ఇదే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు నెల రోజులకు పైగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు ముక్కలు అయ్యి ఇప్పుడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా (మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజక వర్గాలు కలుపుకుని)గా ఏర్పాడు, కుప్పం, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల పత్రాలతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన పలు కీలకమైన డాక్యూమెంట్లు అన్నీ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్నాయని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications