కడప సెగ: కేంద్రమంత్రి కారును అడ్డుకున్న సీమ నేతలు, బూటు విసిరిన మహిళ
కడప: కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు శనివారం అడ్డుకున్నారు.
కడప ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద మంత్రి అనంతకుమార్ హెగ్డే కారు ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంతకుమార్ కదలకుండా కారు లోపలే ఉండిపోయారు.

కాగా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేస్తూ.. కారును ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని లాగి పక్కకు పడేశారు. ఆ తర్వాత కారు ముందుకు కదిలింది.
ఈ క్రమంలో అనంతకుమార్ కారు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారు వైపు బూటును విసిరింది. అప్పటికే ఆ కారు అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications