వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తచరిత్ర, జగన్ కేసుని పక్కన పెట్టండి: బాబుపై వాసిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Concentrate on Loan Waiver: Vasireddy Padma
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త చరిత్రకు బదులు రక్త చరిత్ర సృష్టిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిస్తే కేసులు మాఫీ అవుతాయని మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ నేతలు న్యాయవ్యవస్థను కించపర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రజల తరఫున పోరాటం చేసే క్రమంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిస్తే కేసులు మాఫీ అవుతాయా చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ కేసుల మాఫీ సంగతి పక్కన పెట్టి.. టీడీపీ ఇచ్చిన రుణమాఫీని అమలు చేయాలన ఆమె హితవు పలికారు. గత తెలుగుదేసం పార్టీ హయాంలో జరిగిన హత్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.

English summary
YSR Congress Party spokes person Vasireddy Padma on Friday suggested on loan waiver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X