అమరావతి నాటి వైభవం .. నేటి దుస్థితి .. శంకుస్థాపన ప్రాంతంలో రాజధాని రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్ళు. ఈ ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో పరిపాలనకు సంబంధించిన పలు భవనాలు నిర్మాణం కాగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాడు టీడీపీ హయాంలో రాజధాని అమరావతి ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పగా, నేడు రాజధాని ప్రాంతం ప్రశ్నార్ధకంగా మారింది.

ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన ప్రాంతంలో వినూత్న నిరసనలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో అమరావతి ప్రాంత రైతులు 310 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
నేడు ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిపి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టారు . మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల్లో రైతులు మహిళలు, జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి నాటి వైభవం నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మోడీ శంకుస్థాపన జరిగిన చోటే ఆందోళనలు .. సర్వమత ప్రార్ధనలు
ఉద్దండరాయునిపాలెం లో అమరావతి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. నాటి శంకుస్థాపనకు గుర్తుగా , నేడు దయనీయ పరిస్థితులు తెలియజేసేలా ఆందోళనలకు నిర్ణయం తీసుకున్నారు . రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ఉదయం తొమ్మిది గంటలకు రాయపూడి మండలం నుండి పాదయాత్రగా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకుని, సర్వమత ప్రార్థనలు సాగిస్తున్నారు. రాజధాని ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .

అమరావతి చూపు మోడీవైపు పేరుతో వినూత్ననిరసన .. రాత్రికి కాగడాల ప్రదర్శన
అమరావతి చూపు మోడీవైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేపట్టనున్నారు. రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాలను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు .రాజధాని శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ కలగజేసుకోవాలని రాజధాని ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నాడు ఎంతో గొప్పగా నీళ్ళు, మట్టి తెచ్చి శంకుస్థాపన చేసిన మోడీ ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంత పరిస్థితిని చూడాలని, అమరావతినే రాజధానిగా ఉండేలా చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు .
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications