Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాయల టీ వెనక కుట్ర, రాజధాని ఇబ్బందులే: పొన్నం

న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ భగ్గుమన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక కుట్ర ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర రాష్ట్రం రాజధానికి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తీసుకుని వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

Ponnam Prabhakar

సమైక్యాంధ్ర పేరుతో రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు ఉద్యోగులను అయోయానికి గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో అందరికీ రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని ఆయన గుర్తు చేశారు.

రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని తమ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెబుతామని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు తెలంగాణ సారథ్య బృందం ఢిల్లీ యాత్ర చేపడుతుందని ఆయన మీడియాతో చెప్పారు. ఈ నెల 8వ తేదీన రాజ్‌ఘాట్‌ను సందర్సిస్తామని, 9వ తేదీన సోనియాను కలుస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 10వ తేదీన ప్రదర్శన, చర్చా గోష్టి ఉంటాయని చెప్పారు. ఈ నెల 11, 12 తేదీల్లో తెలంగాణకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకే మద్దతు ఇవ్వాలని తాము కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కోరినట్లు తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. జైపాల్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బ తీయవద్దని ఆయన సూచించారు. 60 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేస్తోంది ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం కోసమేనని ఆన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+