హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం! కానిస్టేబుల్తో ఆహ్వాన పత్రం పంపిన ఉన్నతాధికారులు?
Recommended Video

విజయవాడ: డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం మంత్రి చినరాజప్పకు ఘోర అవమానం జరిగింది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శంకుస్థాపనకు పోలీసు ఉన్నతాధికారులు ఒక కానిస్టేబుల్తో ఆహ్వానపత్రం పంపించడంతో ఆయన నిర్ఘాంతపోయారు.
ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హోం మంత్రి చినరాజప్ప హాజరు కాలేదు.

ఆయన విజయవాడలోనే ఉండీ కార్యక్రమానికి ఎందుకు రాలేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. శంకుస్థాపన ఆహ్వానపత్రికను మొక్కుబడిగా కార్యాలయంలోని సిబ్బంది చేతికి ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలీసు ఉన్నతాధికారుల తీరుతో నొచ్చుకున్న హోం మంత్రి చినరాజప్ప ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సదరు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రంలోపు చినరాజప్పతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భూమి పూజ కార్యక్రమలో మంత్రి నారాయణ, స్థానిక నేతలు, డీజీపీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications