సెర్చ్ ఆపరేషన్:30మంది అరెస్ట్,30బైక్స్..సీజ్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలనీలో దొంగలు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. ఆ తనిఖీల్లో 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారందరినీ పోలీస్స్టేషన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఏడుగురు పాత నేరస్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మాదాపూర్ డిసిపి ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మాదాపూర్ డిసిపి క్రాంతీ రాణా టాటా, అడిషనల్ డిసిపి జానకీ షర్మిల, మాదాపూర్ ఏసిపి శ్రీధర్, కూకట్పల్లి ఏసిపి సాయిమనోహర్, సైబరాబాద్ పరిధిలోని 30 మంది సిఐలు, 20మంది ఎస్ఐలు, 250 మంది సిబ్బంది పాల్గొన్నారు. 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 10 ఆటోలు, రెండు కార్లు, 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలు
నగరంలోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డికాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలు
కాలనీలో దొంగలు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు.
తనిఖీలు
ఆ తనిఖీలలో 30 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ పోలీసు స్టేషన్కు తరలించారు.
తనిఖీలు
అదుపులోకి తీసుకున్న వారిలో ఏడుగురు పాత నేరస్థులు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. మాదాపూర్ డిసిపి ఆధ్వర్యంలో ఆ సోదాలు నిర్వహించారు.
తనిఖీలు
ఈ తనిఖీల్లో మాదాపూర్ డిసిపి క్రాంతీ రాణా టాటా, అడిషనల్ డిసిపి జానకీ షర్మిల, మాదాపూర్ ఏసిపి శ్రీధర్, కూకట్పల్లి ఏసిపి సాయిమనోహర్, సైబరాబాద్ పరిధిలోని 30 మంది సిఐలు, 20మంది ఎస్ఐలు, 250 మంది సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీలు
30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 10 ఆటోలు, రెండు కార్లు, 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.