ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్, భారతదేశంలో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం : ఐసిఎంఆర్
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ అప్పుడే అయిపోలేదు అని, ఆగస్టు నెలలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగనుంది అని ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారతదేశంలో ప్రతి రోజు దాదాపు లక్ష కేసులను నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమీరన్ పాండా ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ మరింత వ్యాప్తికి దారితీయకుండా కట్టడి చేస్తే, పరిస్థితి మొదటి వేవ్ తో సమానంగా ఉంటుందని, అలా కాకుండా వైరస్ మరింత పరివర్తన చెంది ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ పాండా ఐసిఎంఆర్ వద్ద ఎపిడెమియాలజీ మరియు సంక్రమణ వ్యాధుల విభాగానికి అధిపతిగా పని చేస్తున్నారు. తాజాగా ఐసిఎంఆర్ మరియు లండన్ ఇంపీరియల్ కాలేజ్ చేసిన గణిత మోడలింగ్ అంచనాల ప్రకారం తక్కువ టీకా డోసులు , పరిమితులను సడలించడం వంటి కారణాలు కోవిడ్ -19 కేసుల పెరుగుదలను సూచించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేసుల వ్యాప్తి ఉధృతంగా జరిగితే కరోనా సెకండ్ వేవ్ కంటే దారుణమైన పరిస్థితులను చూడాల్సి వస్తుంది అన్నారు. టీకాలు వేయకుండా పరిమితులు సడలించడం వల్ల మూడవ తరంగానికి అవకాశం ఉంటుంది అని ప్రొఫెసర్ పాండా చెప్పారు.
భారతదేశంలో కోవిడ్ -19 యొక్క మూడవ తరంగం యొక్క సానుకూలత ఒక గణిత మోడలింగ్-ఆధారిత విశ్లేషణ అని ఐసిఎంఆర్ చేసిన అధ్యయనం పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ పాండా వెల్లడించారు. లండన్లోని ఇంపీరియల్ కాలేజీలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్తో పాటు ఐసిఎంఆర్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.పీర్-రివ్యూడ్ ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, కరోనా థర్డ్ వేవ్ సంభవించే ఆమోదయోగ్యమైన యంత్రాంగాలను ప్రదర్శించింది.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే, థర్డ్ వేవ్ ఉంటుందని ఖచ్చితంగా అనుకోవచ్చని ప్రొఫెసర్ పాండా చెప్పారు. సామూహిక సమావేశాలను నివారించడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమలు చేస్తే కొంతమేర కరోనా ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ పాండా వెల్లడించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ రేటు తక్కువగా ఉందని, స్మార్ట్ వాక్సినేషన్ ప్రణాళికను ప్రారంభిస్తే, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లను ఇస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. టీకాలు కరోనా మహమ్మారి సంక్రమణ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని మరియు మూడవ తరంగాన్ని తక్కువ ప్రాణాంతకంగా మార్చగలవని ఐసిఎంఆర్ ప్రొఫెసర్ పాండా వెల్లడించారు.