కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిక్కర్ వ్యాపారి దంపతుల హత్య, భార్యకు భర్త నిప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Couple murdered in Kurnool
కర్నూలు: కర్నూలులో దారుణమైన హత్య జరిగింది. లిక్కర్ వ్యాపారి మధుసూదన్ రెడ్డి దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. కర్నూలులోని అపార్టుమెంటులో పక్కవారికి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా హత్య చేసి వెళ్లిపోయారు. ఈ హత్య సంచలనం సృష్టిస్తోంది.

కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తపల్లికి చెందిన మధుసూదన్ రెడ్డి భార్యతో కలిసి కర్నూలులో ఉంటోంది. వారిని నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియడం లేదు. హత్యకు వ్యాపార కారణాలున్నాయా, వ్యక్తిగత కారణాలా అనేది తెలియడం లేదు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమైతే భార్యను ఎందుకు హత్య చేశారనేది తెలియడం లేదు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. జాగిలాలను కూడా రప్పించారు. అయితే అవి హంతకుల జాడను పసిగట్టలేకపోతున్నాయి. లిక్కర్ వ్యాపారంలో మధుసూధన్ రెడ్డి బడా వ్యక్తి కూడా ఏమీ కాడు. హత్య జరిగిన సమయంలో వారి పిల్లలు బయట ఉన్నారు.

కర్నూలు జిల్లా పెద్దకడగూరు మండల పరిధిలోని కంబలహాల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కాశి అనే వ్యక్తి తన భార్య రహ్మద్ బీ (25)కి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారికి కూతురు ఉంది.

English summary

 Liquor businessman Madhusudan Reddy couple have been murdered at Kurnool. A person killed his wife in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X