కంచుకోటల్లో క్రాస్ ఓటింగ్ - ఆ పార్టీ ఆశలపై నీళ్లు..!!
ఏపీలో ఎన్నికల పోలింగ్ లో అనూహ్య పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. గతం కంటే ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదలైంది. పెరిగిన పోలింగ్ శాతం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు పైకి ధీమాగా ఉన్నా..లోలోపల టెన్షన్ పడుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ ప్రచారం ఇప్పుడు కూటమి పార్టీలకు కంటి మీద కునకు లేకండా చేస్తోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
హోరా హోరీ
గోదావరి జిల్లాల్లో అయిదు పార్లమెంట్, 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. మూడ పార్టీల కూటమికి ఇక్కడ సామాజిక సమీకరణాలు..ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేసారు. ఇక్కడ జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్..తన పథకాల పైనే నమ్మకం పెట్టుకున్నారు. పోలింగ్ పూర్తయింది. అయిదు పార్లమెంట్ స్థానాల్లోనూ భారీ పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి పైన ప్రధాన పార్టీలు కసరత్తు చేసాయి. పోల్ అయిన ఓట్లు ఎవరికి ఎన్ని దక్కాయనేది తేల్చే పని మొదలు పెట్టాయి. మరో వైపు పలు సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

క్రాస్ ఓటింగ్ తో
పోలింగ్ సరళి పైన విశ్లేషణ సమయంలో లింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్దయెత్తున జరిగిందని చెబుతున్నారు. మూడు పార్టీల అభ్యర్దులు బరిలో నిలిచారు. మూడు గుర్తుల పైన పోటీచేసారు. ఇంటింటి ప్రచారంలోనూ ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు. మూడు గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురవుతారని భావించి మూడు పార్టీలూ కూడా ఒక గుర్తు ను మాత్రమే ప్రచారం చేసి వెళ్లారు. అయితే కొన్ని చోట్ల రెండు గుర్తులకు ఓటు వేయాల్సి వచ్చింది. ఇది ఇబ్బందిగా మారింది. కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థి పోటీ చేయగా, రాజమండ్రి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అసెంబ్లీ అభ్యర్దులు మరో గుర్తుతో పోటీలో ఉన్నారు.
ఫలితం తారు మారు
గోదావరిలో జిల్లా కేంద్రంగా ఉన్న ఒక కీలక నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే లెక్కలు బయటకు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా అదే అభ్యర్ది గెలుపు పైన పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మరో జిల్లా కేంద్రంగా ఉన్న ఎంపీ సీటులో ఊహించని విధంగా ఎమ్మెల్యేకు ఒక విధంగా మద్దతు తెలిపిన ఓటర్లు..ఎంపీ స్థానంలో మాత్రం వారి ప్రత్యర్ధికి ఓటు వేసినట్లు లెక్కల ద్వారా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా మారిన మరో ఎంపీ నియోజకవర్గంలోనూ స్థానిక సమీకరణాల ఆధారంగా పోలింగ్ జరగటం ప్రధాన పార్టీకి మింగుడు పడటం లేదు. దీంతో.. ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావం తో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications