38 కేసులు: పేరు మోసిన గూండా అరెస్టు (ఫొటో)
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు పేరు మోసిన గూండా, రౌడీ షీటర్ను అరెస్టు చేశారు. సైబారాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఓ ప్రకటనలో ఈ విషయం చెప్పారు. అతను 38 కేసుల్లో నిందితుడని ఆయన చెప్పారు. దోపిడీ, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, హత్యాప్రయత్నం, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్, అల్లర్ల సృష్టి వంటి పలు కేసుల్లో అతను పాలు పంచుకున్నట్లు చెప్పారు.
వివరాలు ఇలా ఉన్నాయి - రంగారెడ్డి జిల్లాలోని మల్లాజిగిరికి చెందిన మొహమ్మద్ ముక్రమ్ అలియాస్ పప్పు అలియాస్ అక్రమ్ అనే రౌడీ షీటర్ను పీడియాక్ట్ కింద అరెస్టు చేశారు. గూండాయిజానికి, దారుణమైన నేరాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితి ఉంది.

అక్రమ్ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. మల్కాజిగిరిలోని అతన్ని అరెస్టు చేయడానికి తనకు సంక్రమించిన అధికారాలతో కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఓ ముఠాకు నాయకత్వం వహిస్తూ అతను ప్రమాదకరమైన, చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నట్లు ఆనంద్ తెలిపారు. ప్రభుత్వాధికారులను కూడా బెదిరించినట్లు అక్రమ్పై ఆరోపణలున్నాయి. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అతనిపై 38 కేసులున్నాయి.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications