నివర్ ఎఫెక్ట్ : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు- పెరిగిన చలి గాలుల తీవ్రత
ఏపీలో నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను తీరం దాటిపోవడంతో ముప్పు తప్పిందని భావించినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లో భారీగా నీరు చేరుతోంది. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఈ తెల్లవారుజామున తమిళనాడులోని మామళ్లపురం-కరెైకల్ మధ్య తీరం దాటిన నివర్ తుపాను ఏపీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న సాయంత్రం నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. అర్ధరాత్రి తుపాను తీరం దాటిన సమయంలో మొదలైన వర్షాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని గోదావరి జిల్లాల నుంచి మొదలుపెట్టి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

భారీవర్షాల కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా.. విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకూ ఇబ్బందులు తప్పడం లేదు. అదే సమంయలో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది. ఓవైపు భారీవర్షాలు పడుతున్నా చలిగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్దితులు చాలా జిల్లాల్లో ఉన్నాయి. తుపాను తీరం దాటినా బలహీన పడే క్రమంలో వర్షాలు, చలిగాలులు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
భారీ వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉన్న పలు జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతోంది. రెండురోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలో నుంచి రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మత్సకారులను నిన్నటి నుంచే వేటకు వెళ్లడాన్ని నిషేధించారు. స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications