సంవత్సరం వేరైనా రోజుల తేడా: అక్కినేని మృతిపై దాసరి
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు కళ్లు వెళ్లిపోయాయని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు అన్నారు. అక్కినేని మృతదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సమయంలో దాసరి మాట్లాడారు. సంవత్సరాలు వేరైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు, అక్కినేనిలు నాలుగు రోజుల తేడాలోనే మృతి చెందారన్నారు.
ఆయనతో తాను 26 చిత్రాలు తీశానన్నారు. అక్కినేనితో, ఆయన కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధముందని చెప్పారు. సినీ పరిశ్రమకు రెండు కళ్లు పోయాయన్నారు. చిత్ర ధృవతారల్లో అక్కినేని ఒకరన దాసరి చెప్పారు.

రెండు కళ్లు పోయాయి: మోహన్ బాబు
చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేనిల మృతితో రెండు కళ్లు పోయినట్లయిందని మోహన్ బాబు అన్నారు. తాము తండ్రీ కొడుక్లలా ఉండేవారమన్నారు. ఆయన చిత్రాల్లో తాను విలన్గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, కమేడియన్గా నటించానని చెప్పారు. ఆయన దగ్గర తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రెండు నెలల క్రితమే తాను ఆయనను కలిశానని చెప్పారు. అక్కినేని మహా నటుడు అన్నారు.
అక్కినేని మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రామానాయుడు అన్నారు. రెండు కళ్లు పోయినట్లయిందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. కాగా అక్కినేని మృతదేహానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications