చిరంజీవి ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు!: దాసరి
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ సారథి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో ఎందుకు విలీనం చేశారో అర్థం కాలేదని కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు. దాసరి నారాయణ రావు ప్రముఖ తెలుగు టీవి ఛానల్తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పిఆర్పీ విలీనానికి తాను బయటకు రావడానికి సంబంధం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరు తనను చాలా బాధించిందని చెప్పారు. బొగ్గు కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బొగ్గు కుంభకోణం విషయంలో తన పైన పడ్డ మచ్చ చెరిగిపోయే వరకు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని దాసరి చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తనను గతంలో కలిసింది కేవలం తన ఆశీస్సులు తీసుకోవడానికేనని చెప్పారు. తన పార్టీలో చేరమని పిలిచేందుకు ఆయన కలువలేదన్నారు. ఆయన పైన తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు.
ముఖ్యమంత్రిగా ఉంటూ సొంత పార్టీ అధిష్టానానికి ఎదురు తిరగడంపై ఆయనకు కితాబిచ్చారు. పార్టీలో ఉంటూ, అదీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఎదురు తిరగడం... ఎవరు ఇప్పటి వరకు చేయలేదని చెప్పారు. కిరణ్ రెడ్డిని తాను సమర్థించాలనుకున్నానని, అయితే సమయం చాలలేదన్నారు. ఆయన నమ్ముకున్న వారు ఒక్కరొక్కరు పార్టీని వీడి వెళ్లిపోయి ఆయనను ఒంటరి చేశారన్నారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications