వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ ఫలితాలు: 'ఇది మోడీ ఫెయిల్యూర్ కాదు', మోడీకి నితీష్ థ్యాంక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఓటమి పైన కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు స్పందించారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ఫెయిల్యూర్‌గా చెప్పలేమన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పైన తాము జాతీయస్థాయిలో చర్చిస్తామని చెప్పారు. బీహార్ ఎన్నికల్లో కుల సమీకరణ ప్రధానంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. జాతీయ నాయకత్వం ఏం చేసినా స్థానిక పరిస్థితులు కారణం అవుతాయన్నారు. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదన్నారు. పార్టీల మధ్యనే పోటీ అన్నారు.

మరోవైపు, బీహార్ ఎన్నికల ఫలితాలకు ప్రధాని మోడీని నిందించడం ఏమాత్రం సరికాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కేంద్రానికి రెఫరెండం కాదని మొదటి నుంచి చెబుతున్నారు. బీహార్‌లో ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు.

సమయం వచ్చినప్పుడు ప్రతి విషయంపై క్షుణ్ణంగా చర్చిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ దాదాపు 30 బహిరంగ సభల్లో ప్రసంగించారు.

Dattatreya says Bihar results are not PM Modi's defeat

నితీష్‌కు సోనియా గాంధీ అభినందనలు

మూడోసారి బీహార్ ముఖ్యమంత్రి కాబోతున్న నితీష్ కుమార్‌కు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దానికి నితీష్ కుమార్ ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు నితీష్‌కు అభినందనలు తెలిపారు. వారికి నితీష్ కుమార్ ధన్యవాదాలు చెప్పారు.

English summary
Bharatiya Janata Party on Sunday said that Bihar Assembly election results are not PM Modi's defeat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X