చనిపోయాడని ఫిక్స్ అయ్యారు..! లేచి కూర్చోవడంతో అవాక్కయ్యారు
మునగపాక : చావు ఎవరికైనా విషాదమే.. అయితే సదరు వ్యక్తి చనిపోకముందే చనిపోయాడని భ్రమ పడడం మరింత విషాదం. విశాఖపట్నం జిల్లా మునగపాక మండల పరిధిలోని గవర్ల అనకాపల్లి గ్రామంలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
కాండ్రేగుల సీతారామ్ తీవ్ర అస్వస్థకు గురవడంతో.. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించారు కుటుంబ సభ్యులు. సీతారామ్ ను పరీక్షించిన సదరు వైద్యుడు సీతారామ్ అప్పటికే చనిపోయినట్లుగా నిర్దారించాడు. దీంతో సీతారామ్ ఇక లేడన్న షాక్ కు గురైన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరోవైపు అంత్యక్రియల ఏర్పాట్లు కూడా చేశారు బంధువులు.

అయితే స్మశానానికి తరలించేందుకు సిద్దమవుతోన్న సమయంలోనే.. సీతారామ్ గుండె ఇంకా కొట్టుకుంటున్నట్లుగా గమనించాడు ఓ వ్యక్తి. దీంతో వెంటనే అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం సీతారామ్ ఒక్కసారిగా లేచి కూర్చుని, అంతకుముందులా మామూలుగానే మాట్లాడడం మొదలుపెట్టాడు.
చనిపోయాడనుకున్న సీతారామ్ ఇలా.. లేచి కూర్చోవడంతో షాక్ లొ ఉన్న కుటుంబ సభ్యులంతా తొలుత అవాక్కయినా, ఆ తర్వాత ప్రాణ గండం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications