అమరవీరుల, స్వాతంత్ర్య సమరయోధుల కోసం ఓ వెబ్సైట్
న్యూఢిల్లీ: అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వెబ్సైట్లో అమరవీరుల త్యాగాన్ని, వారికి సంబంధించిన వివరాలన్నింటిని భావి తరాలకు తెలిసేలా, యువతరానికి స్ఫూర్తినిచ్చేలా పొందుపరుస్తారు.

ఈ నెల 27వ తేదీన షహీద్ భగత్ సింగ్ 110వ జయంతి సందర్భంగా అమరవీరులను, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించేందుకు 'షహీద్ ఉత్సవ్' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెబ్సైట్ను ప్రారంభిస్తామని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వాతంత్య్ర సమరయోధులను, వీర సైనికులను ఎంపిక చేస్తారు. వారి కుటుంబ సభ్యులను లేదా వారసులు, సన్నిహితులను కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. విదేశాల్లో స్థిరపడ్డవారికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ద్వారా వారి కుటుంబాలను సంప్రదించారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications