ఎన్జీవోలపై ఢిల్లీ పోలీస్ ఆరా, ఫుడ్ లారీలకు టి ఝలక్
అంతకుముందు ఢిల్లీకి వెళ్తున్న ఎపిఎన్జీవోలు, సమైక్యవాదులకు ఫలహారం, భోజనం, వంటవాళ్లను తీసుకెళ్తున్న లారీలను తెలంగాణవాదులు అడ్డగించారు. అదిలాబాద్ చెక్ పోస్టు వద్ద లారీలను అడ్డుకున్నారు. దీంతో రైళ్లలో ఉన్న ఎపిఎన్జీవోలు తిండి లేక అలమటించారు. వారికి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు మరో ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర నేతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఆహారం, వంటవాళ్లను తీసుకెళ్తున్న లారీలను తెలంగాణవాదులు అదిలాబాదు చెక్ పోస్టు వద్ద శనివారం రాత్రి అడ్డగించినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ నుండి అనుమతి పత్రాలు, ఆర్సీ బుక్స్, ఫోన్స్ తీసుకున్నట్లుగా సమాచారం. దీంతో సమాచారం కూడా చేరవేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారిని ఆదివారం ఉదయం వదిలేశారు.
మరోవైపు, మహబూబ్ నగర్ జిల్లా గద్వాల రైల్వే స్టేషననులో శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వుకున్నారు. ఛలో ఢిల్లీ కోసం బయలుదేరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల ప్ర్తయేక రైలు రాత్రి ఎనిమిది గంటలకు క్రాసింగ్ ఉండటం వల్ల గద్వాల స్టేషననులో ఆగింది. ఈ సమయంలో రైలులో ఉన్న కార్యకర్తలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. వారిని చూసి స్టేషన్లో ఉన్న ప్రయాణీకులు జై తెలంగాణ అన్నారు. అనంతరం రాళ్ల దాడి జరిగింది.