టీ నేతలకు డిమిలిటేషన్ వర్రీ: జైపాల్ రెడ్డే దిక్కు

కాగా, డిలిమిటేషన్ వల్ల హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 14 నుంచి 18కి పెరగవచ్చునని భావిస్తున్నారు. సీమాంధ్ర నుంచి వలస వచ్చినవారు రంగారెడ్డి జిల్లాలో పెద్ద యెత్తున ఉన్నారు. దీంతో సీమాంధ్ర నాయకులకు ఇది ఉపయోగపడవచ్చునని భావిస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులో రెవెన్యూ జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య 15 నుంచి 14కు తగ్గుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ మేరకు అవశేషాంధ్ర ప్రదేశ్లో ఓ సీటు తగ్గుతుంది. డిలిమిటేషన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగకుండా చూడాలని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరనున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది.
లోకసభ ఎన్నికలతో పాటు విభజన తర్వాత ఏర్పడే రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా జరిగేలా చూడాలని జైపాల్ రెడ్డి సూచించనున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తే విభజన ఫలితాలు పార్టీకి దక్కకుండా పోతాయని కాంగ్రెసు తెలంగాణ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications