Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీఎం తర్వాత నేనే: కేఈ ఆవేశం

టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నా

కర్నూలు: టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తనకు రైతు రుణమాఫీ కాలేదంటూ.. ఓ రైతు డిప్యూటీ సీఎంను నిలదీశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి ఆగ్రహంతో ఊగిపోయారు. 'షటప్! డోంటాక్! చేతులు చూపిస్తూ మాట్లాడతావా?' అంటూ ఆవేశంగా హెచ్చరించారు.

Deputy cm ke krishnamurthy fired farmers

'సారా తాగొచ్చిన నాయాళ్లతో కలిసి గొడవ చేస్తావా? ఫ్యాక్షన్ గ్రామాల్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి ఇక్కడికి వచ్చా' అని కేఈ కృష్ణమూర్తి సదరు వ్యక్తితో అన్నారు. అంతేగాక, 'ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డిప్యూటీ సీఎంతో.. అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిని నేను' అని కేఈ ఆగ్రహంగా మాట్లాడారు.

Recommended Video

    World Bank shock to Chandrababu అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ డైలమా? | Oneindia Telugu

    1978లో డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేశానని, చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరం కూడా టీడీపీలో చేరామని చెప్పుకొచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+