ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీఎం తర్వాత నేనే: కేఈ ఆవేశం
టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నా
కర్నూలు: టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకు రైతు రుణమాఫీ కాలేదంటూ.. ఓ రైతు డిప్యూటీ సీఎంను నిలదీశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి ఆగ్రహంతో ఊగిపోయారు. 'షటప్! డోంటాక్! చేతులు చూపిస్తూ మాట్లాడతావా?' అంటూ ఆవేశంగా హెచ్చరించారు.

'సారా తాగొచ్చిన నాయాళ్లతో కలిసి గొడవ చేస్తావా? ఫ్యాక్షన్ గ్రామాల్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి ఇక్కడికి వచ్చా' అని కేఈ కృష్ణమూర్తి సదరు వ్యక్తితో అన్నారు. అంతేగాక, 'ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డిప్యూటీ సీఎంతో.. అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిని నేను' అని కేఈ ఆగ్రహంగా మాట్లాడారు.
Recommended Video

1978లో డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేశానని, చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరం కూడా టీడీపీలో చేరామని చెప్పుకొచ్చారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications