టీడీపీ నేతల చీకటి భాగోతం బయట పెడతా : టీడీపీ-జనసేన వి చిల్లర రాజకీయాలు : దేవినేని అవినాశ్..!!
టీడీపీ..జనసేన పైన వైసీపీ యువనేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ,జనసేన నేతలు పని పాట లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నారేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో పాలన చేస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనలో కరువుతో రాష్ట్రం అల్లాడిందని పేర్కొన్నారు. వర్షాలకు రోడ్లు పాడైపోతే వందల కోట్లతో బాగు చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో నాణ్యత లేని రోడ్డు వేశారు కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అవినాశ్ చెప్పారు.
Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)
కమిషన్లు కి కక్కుర్తి పడి నాసిరకం రోడ్లు టీడీపీ నేతలు వేయించారని..జగన్ ప్రభుత్వం లో దుర్గ గుడి ఫ్లై ఓవర్ .. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేశారని అవినాశ్ పేర్కొన్నారు. ప్రారంభించటం గొప్ప కాదు..పూర్తి చేయటం గొప్ప అని టీడీపీ నేతలు గ్రహించాలని సూచించారు. కాంట్రాక్టర్ల ఉసురు పోసుకున్నారు కాబట్టే టీడీపీ అడ్రస్ లేకుండా గల్లంతైందంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ సత్తా ఏమిటో మంగళగిరి లోనే తెలిసిపోయిందని ఎద్దేవా చేసారు. వారానికోసారి బయటకి వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపణలు పెడతాడంటూ ఫైర్ అయ్యారు.

పార్టీ ఆఫీసుల్లో కూర్చుని రాజకీయాలు చేస్తే ప్రజలు ఆ ఆఫీసు కి పరిమితం చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు.. లోకేష్ లు వాస్తవాలు తెలియాలంటే ప్రజల్లోకి రావాలని అవినాశ్ సూచించారు. జగన్ ని విమర్శించే హక్కు ఏ ఒక్క టీడీపీ నేతకు లేదన్నారు. ఎందుకు పనికి రాని దద్దమ్మలుతో కూడా విమర్శలు చేసే స్థితికి టీడీపీ దిగజారిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ ని విమర్శించే టీడీపీ నేతల చీకటి భాగోతం మొత్తం బయట పెడతానంటూ హెచ్చరించారు.
రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి టీడీపీ పార్టీ స్థాపిస్తే..జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయకుండా పారిపోయే స్థితికి చంద్రబాబు తీసుకువచ్చారంటూ వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని విమర్శించడానికి టీడీపీ నేతలు మొరుగుతున్నారని.. ఇంకోసారి పెద్దిరెడ్డి పై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామంటూ అవినాశ్ హెచ్చరించారు.



Click it and Unblock the Notifications
