Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూటలు మోసిన ఇంటర్నేషనల్ క్రిమినల్: కేవీపీపై దేవినేని, జగన్ రాసిపెట్టుకో..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావుపై మంత్రి దేవినేని ఉమ మంగళవారం తీవ్రంగా స్పందించారు. కేవీపీ ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని, మూటలు మోసిన వ్యక్తి అన్నారు.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు అంశంపై టిడిపిని, చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రశ్నించడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం తీవ్రంగా స్పందించారు. కేవీపీ ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని, మూటలు మోసిన వ్యక్తి అన్నారు.

2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే మహా సంకల్పంతో తాము ఉన్నామని, అందుకే పనులు పరుగెత్తిస్తున్నామని దేవినేని చెప్పారు. కానీ కేవీపీ మాత్రం శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

మూటలు మోసిన ఇంటర్నేషనల్ క్రిమినల్

మూటలు మోసిన వ్యక్తి, అంతర్జాతీయ క్రిమినల్ అయిన కేవీపీ పోలవరం పైన శాపనార్థాలు పెడతారా అని ధ్వజమెత్తారు. ఆయన ఎఫ్‌బీఐ ముద్దాయి అన్నారు. ఢిల్లీకి మూటలు మోసిన వ్యక్తి కేవీపీ అని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తే వ్యతిరేకిస్తారా అని ఆగ్రహించారు.

కేవీపీ శాపనార్థాలు పెడితే పనులు ఆగిపోతాయా అని ప్రశ్నించారు. పోలవరం పనుల పైన జగన్ కూడా ఇలాగే మాట్లాడారన్నారు. కేవీపీ సిగ్గులేకుండా వైసిపి అధినేతకు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు.

Devineni counter to KVP on Polavaram and fires at YS Jagan

జగన్ రాసిపెట్టుకో

జగన్! రాసిపెట్టుకో.. ఎంతమందితో నీవు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపించాలని చూసినా, ఎంత మందితో పోలవరంను తిట్టించినా.. పనులు ఆగవన్నారు. మా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అక్రమాలు, అవినీతి జరిగిందన్నారు. కేవీపీకి పోలవరం పైన మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కేవీపీ అవినీతి చిట్టా బయటకు తీస్తామని దేవినేని హెచ్చరించారు. నిర్వాసితులకు పరిహారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పేద, గిరిజనుల పక్షాన తమ ప్రభుత్వం ఉందన్నారు.

ఆ పేరు చెప్పి ప్రచారం చేయను

జగన్, కేవీపీ, విజయ సాయి రెడ్డి తదితరులు కలిసి పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తున్నారన్నారు. మరో పేరు చెప్పనా.. మీకందరికీ తెలుసునని, కానీ తాను ఆ పేరు చెప్పి ప్రచారం చేయదలుచుకోలేదన్నారు.

మోడీపై ఒత్తిడి తెచ్చి..

విభజన అనంతరం... ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని ప్రధాని మోడీ పైన ఒత్తిడి తెచ్చారన్నారు. ఈ కారణంగా పోలవరం సాధ్యమవుతోందన్నారు. ముంపు మండలాలను కలపడం వల్లే ప్రాజెక్టు సాధ్యమైందన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, కేవీపీకే మతిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారన్నారు. ప్రతి వారం పోలవరం వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏడుస్తారన్నారు.

పోలవరం ప్రాజెక్టు పేరుకు పేరు పైన వివాదం తీసుకు రావడం విడ్డూరమన్నారు. ఏపీలో కట్టే ప్రాజెక్టులకు జగన్మోహన్ రెడ్డి సాగర్, కేవీపీ సాగర్ అని పేరు పెట్టాలా అని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా పేరును తొలగించడంపై కేవీపీ ప్రశ్నించగా.. దేవినేని ఘాటుగా స్పందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+