జగన్ రాజ ద్రోహానికి పాల్పడుతున్నారు, చేసి చూపిస్తాం: దేవినేని ఉమ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. తాము రాజధాని నిర్మాణం చేపడుతుంటే.. జగన్ దీక్ష పేరిట ప్రజలన మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సెక్యూరిటీ లేకుండా ఏపి సిఎం చంద్రబాబు గ్రామాల్లోకి వెళితే రాళ్లతో కొడతారన్న జగన్మోహన్ రెడ్డి రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి తమను కొట్టేంత దమ్ముందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి అసాధ్యమనుకున్నవన్నీ తాము సుసాధ్యం చేశామని వివరించారు. 11 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తమను విమర్శిస్తున్నారని ఎద్దేశా చేశారు. ఓదార్పు పేరిట యాత్రలు చేసేందుకు.. ఎవరు చనిపోతారా? అని జగన్ గోతికాడ నక్కలా కాచుకు కూర్చుంటున్నారని ఆరోపించారు.
ఏపిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటున్నామని దేవినేని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2018నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమానికి రైతులు వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications