జాతియ రహాదారిపై బైఠాయించిన దేవినేని
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పును తీవ్రంగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న టీడీపీ వర్గాలు ...నేడు రాజధానితోపాటు రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక కూడ రాజధాని మార్పుపై సంకేతాలు ఇవ్వడంతో ఆపార్టీ నేతలు మరింత ఆందోళనకు గురయ్యారు.
దీంతో ఆ పార్టీ నేత మాజీ మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వర్ రావు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కృష్ణా జిల్లాలోని కంచికచర్ల వద్ద గత జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలోనే జాతియ రహదారిపై ఉమతో పాటు పలువురు టీడీపీ నేతలు బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు.
కాగా రాజధాని తరలింపుపై గుంటూరు , కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు చెలరేగతున్న విషయం తెలిసిందే... మరోవైపు అమరావతి రైతులు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఆందోళనలను నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీలో కూడ కొంతమంది మాజీ మంత్రులతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం రాజధాని మార్పు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విషయం తెలిసిందే...