వైసీపీకి బీజేపీ చేస్తున్న తాజా మేలు ఇదే..! సర్వేల ఎఫెక్టేనా?
ఏపీలో వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్న టీడీపీ-జనసేన ద్వయం బీజేపీ కూడా తమతో కలిసివస్తే ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేయొచ్చనే ఆశతో ఉన్నాయి. అయితే ఈ మేరకు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టడంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత తంతు మాత్రం ముగించడంలో విఫలమవుతున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం తాజాగా చంద్రబాబుతో పాటు జగన్ ను సైతం పిలిపించి మాట్లాడింది. ఆ తర్వాత లెక్కలు మారినట్లు కనిపిస్తున్నాయి.
చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా.. వాస్తవ పరిస్దితులపై ఆరా తీశారు. అలాగే టీడీపీ, జనసేన మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి సర్వే రిపోర్టుల్ని సైతం చంద్రబాబు ముందు పెట్టి మాట్లాడినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం జగన్ ను ప్రధాని మోడీ పిలిపించుకుని మాట్లాడారు. చంద్రబాబుతో మాట్లాడిన అమిత్ షా, జేపీ నడ్డా తిరిగి జగన్ ను పిలిపించుకుని మాట్లాడితే బావుండదని భావించి మోడీతో జగన్ కు సమావేశం ఏర్పాటు చేయించారు.

అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మెజారిటీ సర్వేలు వైసీపీకే జై కొడుతున్నాయి. తాజాగా వెలువడిన ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. దీంతో పాటు కేంద్ర నిఘా నివేదికలు ఎలాగో ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన బీజేపీ పెద్దలు ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేనతో పొత్తుపై ప్రకటన చేయరాదని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీతో సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన ఇద్దరూ మాట్లాడే పరిస్దితి లేదు. అలాగని ఆలస్యం చేస్తే కచ్చితంగా వైసీపీకి మేలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications