కల్తీ మద్యం కేసులో ట్విస్ట్: మల్లాది విష్ణు ఆస్తులు రూ.600 కోట్లు
విజయవాడ: విజయవాడ స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. కల్తీ మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించిందంటూ టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.
మల్లాది విష్ణు కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడు. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. మల్లాది విష్ణు అక్రమాస్తుల కేసును సిట్ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడి)కి అప్పగించినట్లు సమాచారం.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మల్లాది విష్ణు భారీగా అస్తులు సమీకరించుకున్నట్లు తెలుస్తోంది. బినామీల పేర్ల మీద పెద్ద యెత్తున ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిసరాల్లో 28 వేల ఎకరాలను ఆయన సమీకరించుకున్నట్లు చెబుతున్నారు. వుడా చైర్మన్గా ఉన్నప్పుడు భారీగా ఆస్తులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలో లేని ప్రాంతాల్లో మల్లాది విష్ణు భూములు సమీకరించకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ఆ వార్తలను మల్లాది విష్ణు ఖండిస్తున్నారు. తనకు అన్ని ఆస్తులు లేవని ఆయన అన్నారు. అటువంటివి ఏమీ లేవని ఆయన అన్నారు. తనపై అధికార తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందని ఆయన అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications