ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం : సీయస్ పై వేటు..కొత్త సీయస్ గా ఎల్వీ: అసలు కారణం ఇదే..!
ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీఠా పై వేటు వేసింది. ఏకం గా చీఫ్ సెక్రట్రీ స్థాయి అధికారి పైనే వేటు వేయటం కలకలం సృష్టిస్తోంది. ఆయన్ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన సీయస్ గా ఎల్వీ సుబ్రమణ్యం ను నియమించింది.

సీయస్ పై ఎన్నికల సంఘం వేటు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠా పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన్ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యం ను ప్రభుత్వ ప్రధా న కార్యదర్శిగా పునీఠా స్థానంలో నియమించారు. ఏపిలో ఐపియస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకు న్న నిర్ణయాన్ని అమలు చేయటం లో అపద్దర్మ ప్రభుత్వ ఒత్తిడికి లొంగారనే కారణంతో ఆయన్ను ఎన్నికల సంఘం తమ వద్దకు పిలిపించింది. ఆయన ఇచ్చిన వివరణ తో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం ఆయనను ఎన్నికల విధు ల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నే ఎన్నికల సంఘం బదిలీ చేయటం ద్వారా ఏపిలో పరిస్థితుల పై ఎంత సీరియస్ గా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందో అర్దం అవుతోంది.

ఏబి వెంకటేశ్వర రావు జీవో నే కారణమా..
ఏపి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావుతో పాటుగా మరో రెండు జిల్లాల ఎస్పీలను ఎన్నికల విధుల నుండి తప్పి స్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే, ఏపి ప్రభుత్వం ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం తొలుత ఉత్త ర్వులు జారీ చేసి..ఆ తరువాత ఇంటలిజెన్స్ చీఫ్ విషయంలో ఎన్నికల సంఘం తో న్యాయ పోరాటానికి దిగింది. దీని పై ఆపద్దర్మ ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ను తప్పించి ఇద్దరు ఎస్పీలను మాత్రం బదిలీ చేసింది. దీని పై కోర్టుకు వెళ్లగా..అక్కడ హై కోర్టు సైతం ఎన్నికల సంఘం ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసిం ది. దీంతో...తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంటలిజెన్స్ చీఫ్ ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నా రు. కానీ, పునీఠా వివరణ పై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం ఏకంగా సీయస్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

కొత్త సీయస్ గా ఎల్వీ సుబ్రమణ్యం..
పునీఠా ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రత్యే క కార్యదర్శి గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ను నియమించారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకూ ఎల్వీ సుబ్రమణ్యం ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఎన్నికల వేళ..తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే ఏ స్థాయిలో ఎంత కఠినంగా వ్యవహరిస్తామో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేసింది. దీంతో..ఎన్నికల సంఘం రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనే టెన్షన్ మొదలైంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications