కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్షుద్రపూజల పేరుతో ఇల్లాలిపై కన్నేశాడు, భర్తకు మత్తిచ్చి భార్యతో పరారీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: మాంత్రికుడి పేరుతో రంగస్వామి అనే వ్యక్తి వచ్చి మోసం చేశాడని డోన్‌లోని కొండపేటకు చెందిన శీను ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెల రోజుల క్రితం పరిచయమైన రంగస్వామి.. క్షుద్రపూజలు చేస్తే బాగా కలిసి వస్తుందని తన కుటుంబ సభ్యులను నమ్మబలికాడని చెప్పాడు.

అళా ఇంట్లో అందరికీ దగ్గరయ్యాడని, ఈ క్రమంలో అతను రెండు రోజుల నుంచి కనిపించలేదని చెప్పారు. ఆయనతో పాటు తన భార్య, చిన్న పాప కూడా కనిపించడం లేదని పోలీసులకు తెలిపారు. బాధితుడు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.

Enchanter eloped with woman in Kurnool district

బాధితుడి భార్యతో ఫోన్లో మాట్లాడగా పుట్టింటికి వెళ్లినట్లు ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా, మాంత్రికుడి పేరు చెప్పుకొని వచ్చిన రంగస్వామి బాధితుడి భార్యపై కన్నేశాడని తెలుస్తోంది. క్షుద్రపూజల సమయంలో భర్తకు మత్తు మందు ఇచ్చి, అతని భార్యను, కుమార్తెను తీసుకెళ్లాడని అంటున్నారు. భర్త కళ్లు మెలకువ వచ్చి చూసే సరికి ఎవరూ కనిపించలేదు.

English summary
Enchanter eloped with woman in Kurnool district. Husband complained against Enchanter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X