వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించనందుకు ముసుగులో వచ్చి తలపగులగొట్టాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Engineering student attacked
గుంటూరు: ప్రేమను కాదన్నందుకు ఇంజనీరింగ్ విద్యార్థి మీద దాడి చేసి తలపగులగొట్టిన సంఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది! ఇది గురువారం జరిగింది. గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన అనూష బాపట్లలో ఎంటెక్ చేస్తోంది. ఆమె రోజు తన గ్రామం నుండి నగరం వరకు నడిచి వెళ్లి అక్కడి నుండి బస్సులో కాలేజ్‌కు వెళ్తుంటోంది.

గురువారం ఆమె కాలేజ్‌కి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యలో ముసుగు ధరించిన ఇద్దరు బైక్ పైన వచ్చి ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అయితే తన పైన దాడి చేసింది తాను ప్రేమను తిరస్కరించిన వ్యక్తిగా బాధితురాలు చెబుతున్నారు. గతంలో తాను గుంటూరులో చదువుతున్న సమయంలో వార్డెన్‌గా పని చేసిన కుమార స్వామి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించే వాడని, అంతకుముందు ఆయన సోదరి వివాహానికి హాస్టల్ విద్యార్థినులతో కలిసి వెళ్లినప్పుడు తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే వాడని తెలిపారు.

అక్కడి నుండి వచ్చాక కూడా వేధింపులు మానలేదని, తనకు ఫోన్ చేసి వేధించేవాడని, కొత్త నెంబర్లు మార్చినా బెదిరిస్తుండేవాడని, తనపై దాడి చేసిన ముసుగు వ్యక్తుల్లో ఒకరు కుమారస్వామిగా గొంతును బట్టి అర్థమవుతోందని చెప్పారు.

English summary
An engineering girl student was attacked by unknown youth in Guntur district on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X