‘డస్ట్ బిన్లా చంద్రబాబు ఫొటో’: తప్పుదోవ పట్టిన విచారణ?
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటో మీద చెత్త వేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటో మీద చెత్త వేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎంబీసీ ఎండీ నాగభూషణం మంగళవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్ వెళ్లి.. సిబ్బంది, కార్మికుల నుంచి వివరాలు సేకరించారు.
కాగా, నాలుగో బ్లాక్ పారిశుధ్య సిబ్బందిపై నెపం వేసేలా విచారణ సాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సచివాలయంలోని నాలుగో బ్లాక్లో సోమవారం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జేఎన్టీసీ సమీక్ష సమావేశంలో సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం సేవించారు.

ఆ తర్వాత ఆ ప్లేట్లను నాలుగో బ్లాక్లోని సమావేశ మందిరంలో టేబుల్ మీదున్న సీఎం చంద్రబాబుపై ఫొటోపైనే వేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ అధినేత అని కూడా పట్టించుకోకుండా డస్ట్ బిన్ లా వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దీనిపై విచారణకు అదేశించింది.












Click it and Unblock the Notifications