వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మాకూ కేసీఆర్‌లాంటి నాయకుడు కావాలి, ఇది ఏపీ ప్రజల అభిప్రాయం'

ఏపీని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుందన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుందన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారన్నారు.

జగన్ పలుచన అయ్యారు: వీడియో చూసిన బాబు, నా వద్దకు రావద్దని హెచ్చరికజగన్ పలుచన అయ్యారు: వీడియో చూసిన బాబు, నా వద్దకు రావద్దని హెచ్చరిక

చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు 544 మంది ఎంపీలను అవమానించినట్లుగానే భావించవచ్చునని చెప్పారు.

విభజన సమయంలో కేసీఆర్ ఒక్కడే అంతమంది ఎంపీలను బలవంతంగా కూర్చోబెట్టి బిల్లు పాస్ చేయించగలడా అని నిలదీశారు. ఇధి సాధ్యమయ్యే పనేనా అని అడిగారు. ఎంపీలు ఏమైనా చిన్నపిల్లలా అన్నారు.

తెలంగాణతో పోటీ పడే సత్తా లేక చంద్రబాబు అక్కసుతో ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దేశమంతా తెలంగాణను ఆమోదించినా చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆయన జీర్ణించుకోలేక అసహనంతో మాట్లాడుతున్నారన్నారు.

chandrababu naidu - kcr

రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పైన కూడా ఈటెల రాజేందర్ స్పందించారు. హౌసింగ్ పైన తమ కమిటీ రిపోర్టు ఇచ్చాక తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.

చంద్రబాబు ఏమన్నారంటే...

రాష్ట్రాన్ని విభజించిన తీరు తెలుగు జాతికి శాశ్వత అవమానంగా మిగిలిపోతుందని, పార్లమెంటు తలుపులు మూసేసి విభజన బిల్లు ఆమోదించిన రోజు ఆవేశం వచ్చిందని, ఏ రోజు తాను అంత బాధపడలేదని, ఆ కోపాన్ని, అవమానాన్ని దిగమింగి శక్తి నిరూపిస్తానని శపథం చేశానని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డికి మైహోం రామేశ్వర రావు షాక్: రూ.90 కోట్ల పరువునష్టం దావారేవంత్ రెడ్డికి మైహోం రామేశ్వర రావు షాక్: రూ.90 కోట్ల పరువునష్టం దావా

దాని ప్రకారమే చరిత్ర తిరగరాసేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తానని, ప్రపంచాన్ని ఆకట్టుకునేలా దేశంలోనే అత్యున్నత రాజధానిగా రూపొందిస్తానని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన వారే అసూయపడేలా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై ఈటెల ఆగ్రహించారు.

English summary
Telangana Minister Etela Rajender on Friday lashed out at AP CM Nara Chandrababu Naidu for state division comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X