ఎవరు సీఎం అని రాయలసీమ డిసైడ్ చేస్తుంది ?, కింగ్ మేకర్ ఎవరో డిసైడ్ చేసిన ఓటర్లు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ గూండాలు పోలింగ్ సక్రమంగా జరగకుండా చేస్తున్నారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నాయకుల మీద వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల తలరాతలు ఈవీఎంలో భద్రపరిచిన ఓటర్లు జూన్ 4వ తేదీ మీ కథ ఉంది అంటూ సైలెంట్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం నాయకుల మీద కసిగా ఉన్న ప్రజలు ఓటు అనే ఆయుధంతో సైలెంట్ గా ఓటు వేసి మా తీర్పు కోసం వేచి చూడండి అంటూ కామ్ గా ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అని కచ్చితంగా క్లారిటీ లేకపోయినా ఓటర్ల మాత్రం అందరి జాతకాలు ఈవీఎంలో పెట్టేశారు.

పలు ప్రాంతాల్లో దొంగ ఓట్లు వెయ్యడానికి ప్రయత్నించిన వారిని ప్రత్యర్థి పార్టీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు అడ్డుకున్నారు. మా ఓటు పీకేశారని, సొంత ఇళ్లల్లో నివాసం ఉంటున్న మా ఓట్లు తొలగించారని కొందరు ప్రజలు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా ఇప్పుడు రాయలసీమలోని అన్ని జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఆదారపడి ఉంటుంది.
గత ఎన్నికల్లో రాయలసీమలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వైసీపీ ఇప్పుడు అదే రాయలసీమలో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. అలాగే టీడీపీ కూడా రాయలసీమలో తమకు మెజారిటీ సీట్లు వస్తామని అంచనా వేస్తోంది. అనంతపురం, కర్నూలు, కడప, అనంతపురం, అన్యమయ్య, చిత్తూరు, తిరుపతి. నంద్యాల, సత్యసాయి జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న నాయకులు గెలుపు మాదే అంటూ ఎవరి ఊహల్లో వాళ్లు ఉన్నారు.
రాయలసీమలోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో వార్ వన్ సైడ్ ఉన్నా కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రపోటీ నెలకోని ఉంది. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు రాయలసీమ బోణి కొడతమాని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఈసారి భారీ సంఖ్యలో రాయలసీమలోని వారి సొంత ప్రాంతాలకు చేరుకుని ఓటు వేశారు. మొత్తం మీద రాయలసీమలో అత్యధిక సీట్లు కైవసం చేసుకునే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications