సింధు విజయానికి కారణం బాబు: అది చంద్రబాబుగారి దార్శనికత: లోకేశ్ ట్వీట్..!!
బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన ఆణిముత్యం విజయం వెనుక చంద్రబాబు దార్శనికత ఉందని మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోపీచంద్ కు అయిదెకరాల స్థలం ఇవ్వటం వలనే..ఇప్పుడు ఆ అకాడమీ పీవీ సిందూ లాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు లోకేశ్ చేసిన ట్వీట్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఒలిపింక్స్ తరువాత సింధును ఏపీ ప్రభుత్వం సన్మానించిన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు లోకేశ్ ట్వీట్ లో గుర్తు చేసారు.
సింధు విజయం వెనుక చంద్రబాబు..
మాజీ మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ట్వీట్ లో చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్ కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోంది. అది చంద్రబాబుగారి దార్శనికత..అని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఇవే వ్యాఖ్యలు చేసారు. అప్పుడు కూడా ఆ వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సింధు దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చి.. దేశ ప్రతిష్టను పెంచిన సమయంలో సింధును అభినందించటానికి పరిమితం కాకుండా.. ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయటం పైన విమర్శలు మొదలయ్యాయి. స్థలం ఇవ్వటం కంటే..సిందూ చేసిన కష్టం.. క్రీడా నైపుణ్యం.. ప్రపంచ స్థాయి టోర్నమెంట్ లో అద్బుత ప్రతిభ గురించి అభినందించి.. భవిష్యత్ లో మరిం కీర్తి సాధించేలా ప్రోత్సహించాల్సిన సమయంలో ఇటువంటి ట్వీట్ లు సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. స్థలం ఇచ్చినంత మాత్రాన పతకాలు వచ్చేస్తాయా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు..

ప్రభుత్వం పైన విమర్శలు..
లోకేశ్ మరో ట్వీట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విశాకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సానియా మీర్జా ఫొటోను పిటీ ఉషా ఫొటోగా పేర్కొనటం పైన విమర్శలు మొదలయ్యాయి. ఇక, లోకేశ్ సైతం తన ట్వీట్ లో ఇక ఇప్పటి వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోంది. సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలీని దురవస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారు...ట్వీట్ చేసారు. ప్రభుత్వంలోని అధికారులు చేసిన తప్పు..పొరపాటు పైన లోకేశ్ చేసిన ట్వీట్ గురించి అభ్యంతరాలు లేకపోయినా.. సింధు తన కష్టంతో ఆడి.. దేశానికి పతకం తెస్తే..ఇప్పుడు కూడా తన తండ్రి గొప్పతనంగా చెప్పటం పైనే విమర్శలు వస్తున్నాయి. అయితే, లోకేశ్ ట్విట్టర్ ఖాతా లో ఆ విషయం పరిగణలోకి తీసుకోకుండా ట్వీట్ చేయటం పైన సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications