Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !!

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. సోమవారం 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,241 మంది తలనీలాలను సమర్పించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 10 గంటల కొద్దీ సమయం పట్టింది. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 5.08 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి.

కాగా- తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభం అయ్యాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం తెల్లవారు జామున 6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగడంతో ఈ విశేష పర్వదినం మొదలైంది.

Experience the Golden Chariot of Bhu Sametha Sri Malayappa Swamy During Vasanthotsavam in Tirumala

నేడు రెండోరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై ఊరేగారు. ఈ ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో అశేష భక్తులను కటాక్షించారు. గోవిందుడి నామాన్ని స్మరిస్తూ వేలాదిమంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి హారతులు పట్టారు. అడుగడుగునా నీరాజనాలు అర్పించారు. భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు.

టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సహా పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అభిషేకించారు. చివరిరోజైన బుధవారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. వీటితో పాటు నేడు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+