fact check : జూన్ 30 వరకూ తిరుమల దర్శనం రద్దు ?
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను పాలమండలి ఆమోదంతో ప్రభుత్వం జూన్ 30 వరకూ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో నెలకొన్న పరిస్దితులను, కేసులను గమనిస్తే ఈ నిర్ణయం నిజమనే అంతా భావిస్తున్నారు. అయితే టీటీడీ బోర్డు దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్ 30 వరకూ శ్రీవారి దర్శనాలు రద్దయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీడీపీ పాలక మండలి ప్రకటించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని టీటీడీ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం లేదా టీడీపీ అధికారిక వెబ్ సైట్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భక్తులకు సూచించింది. అనవసరంగా ఇలాంటి ప్రకటనలు నమ్మి భక్తులెవరూ తిరుమలకు వచ్చేందుకు బయటికి రావొద్దని కోరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మే 3 వరకూ తిరుమలలో ఎలాంటి దర్శనాలకు అనుమతి లేదు. అయితే స్వామి వారికి నిత్య కైంకర్యాలతో పాటు అన్ని పూజలను యథావిథిగా నిర్వహిస్తున్నారు. భక్తులకు దర్శనం కోసం ఎప్పటి నుంచి అనుమతి ఇచ్చేదీ త్వరలోనే ప్రకటిస్తామని టీటీడీ తెలిపింది.
-
భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో కూడా ఆ సేవలు! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications