ఫెయిలవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య.. తీరా చూస్తే ఫస్ట్ క్లాస్ లో...
పరీక్షల్లో తప్పుతానేమో అనే భయంతో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే.. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాసైంది.
గుంటూరు: పరీక్షల్లో తప్పుతానేమో అనే భయం, ఫెయిలయితే నలుగురూ ఏమనుకుంటారో అనే ఆత్మన్యూనత.. చివరికి ఆ విద్యార్థినిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. కానీ తీరా చూస్తే.. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాసైంది. కానీ ఏం లాభం?
ప్రకాశం జిల్లాకు పదేళ్ల క్రితం వలసవచ్చి పుల్లడి గుంటలో స్థిరపడి, పొలాలను కౌలుకు తీసుకుని పనిచేసుకుంటున్న వెంకటేశ్వర్లు, లింగమ్మ దంపతుల కుమార్తె జి దివ్య. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదివింది.

అయితే తాను పరీక్ష సరిగ్గా రాయలేదని, తప్పుతానన్న ఆత్మన్యూనతతో, ఫలితాలు వెలువడడానికి కొద్ది గంటల ముందు దివ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షాక్ ఏమిటంటే.. గురువారం ప్రకటించిన ఫలితాల్లో దివ్య ఫస్ట్ క్లాసులో పాస్ అవడం.
పరీక్షలు రాసొచ్చినప్పటి నుంచి దివ్య ముభావంగా ఉందని, తీవ్ర మానసిక వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. తమ బిడ్డ చనిపోవడం, ఆపై ఆమె ఉత్తీర్ణురాలైనట్టు తెలియడం.. అదీ ఫస్ట్ క్లాసులో అని తెలిసి వెంకటేశ్వర్లు, లింగమ్మ దంపతులు గుండెలవిసేలా రోధించడం అందరి హృదయాలను కలచివేసింది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications