భూసేకరణకు రైతు బలి: ఆర్డీవో కార్యాలయంలో గుండెపోటు..
బాలు నాయక్(50) అనే రైతు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూముల ధరలకు సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. తన భూమికి ఎక్కడ తక్కువ ధర నిర్ణయిస్తారోనన్న ఒత్తిడికి లోనయ్యాడు.
పెనుకొండ: పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణ రైతుల ప్రాణాల మీదకు వస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూసేకరణ ద్వారా భూమి కోల్పోతున్న ఓ రైతు.. ఎక్కడ తక్కువ ధర చెల్లిస్తారోనన్న ఆవేదనతో గుండెపోటుకు గురయ్యాడు.
అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో కార్ల పరిశ్రమ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఇప్పటికే 600 ఎకరాలు ఇందుకోసం సేకరించగా.. మరో 1400 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే భూములిచ్చిన రైతులతో అధికారులు ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బాలు నాయక్(50) అనే రైతు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూముల ధరలకు సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. తన భూమికి ఎక్కడ తక్కువ ధర నిర్ణయిస్తారోనన్న ఒత్తిడికి లోనయ్యాడు.
భూమికి తక్కువ ధర నిర్ణయిస్తే ఇద్దరు కుమార్తెల వివాహం చేయడం కష్టమవుతుందన్న బాధలో బాలు నాయక్ ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన గుండెపోటుకు గురయ్యాడు. బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించినా.. బాలు నాయక్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications