మగ చేప రూ.60 వేలు,ఆడ చేపలు రూ.40 వేలు. పండగ వేళ జాలర్లకు జాక్ పాట్
పండుగ వేళ అనకాపల్లి జిల్లా తీరప్రాంతంలో జాలర్లకు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలల్లో ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు గోల్డెన్ ఫిష్లు చిక్కాయి. స్థానికంగా కచిడి చేపలుగా పిలిచే ఈ అరుదైన చేపలు చిక్కడంతో జాలర్ల ఆనందానికి అవధుల్లేవు. గ్రామస్తులు దీనిని గంగమ్మ కరుణగా భావిస్తున్నారు.
కచిడి చేపలకు అంతగా విలువ ఉండటానికి కారణం వాటి వైద్యపరమైన వినియోగమే. ఈ చేపలోని పిత్తాశయం, ఊపిరితిత్తులు పలు రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు, కచిడి చేప పొట్టభాగం నుంచి తయారయ్యే ప్రత్యేక దారాన్ని శస్త్రచికిత్సల తర్వాత కుట్లకు వినియోగిస్తారు. ఈ దారం కాలక్రమేణా శరీరంలోనే కలిసిపోవడం దీని ప్రత్యేకత. అందుకే వైద్య రంగంలో ఈ చేపకు భారీ డిమాండ్ ఉంది.

మత్స్యకారుల మాటల్లో చెప్పాలంటే, మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో మెరిసిపోతాయి, అందుకే వీటిని గోల్డెన్ ఫిష్లుగా పిలుస్తారు. ఆడ చేపలతో పోలిస్తే మగ చేపలకు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. తాజాగా పట్టుబడిన మూడు కచిడి చేపల్లో రెండు ఆడవి కాగా, ఒకటి మగది. వేలానికి ముందు చేపల పొట్టను కోసి అవి ఆడవో, మగవో నిర్ధారించిన తర్వాతే వేలం వేశారు. ఇందులో రెండు ఆడ చేపలు ఒక్కోటి 40 వేల రూపాయల పైగా, మగ చేప మాత్రం 60 వేల రూపాయలకు మించి ధర పలికింది.
కచిడి చేపకు శాస్త్రీయంగా ప్రొటోనిబియా డయాకాన్తస్ (Protonibea diacanthus) అనే పేరు ఉంది. ఈ చేపలు సముద్రంలో ఒకచోట నిలకడగా ఉండవు. నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే ఇవి వలలకు చిక్కడం చాలా అరుదు. సాధారణంగా లోతైన సముద్ర జలాల్లో నివసించే ఈ చేపలు, పండుగ సీజన్లలో కొన్నిసార్లు తీరానికి దగ్గరగా రావడం విశేషం.
వైద్య రంగమే కాకుండా, ఖరీదైన వైన్ తయారీ పరిశ్రమల్లో కూడా కచిడి చేప భాగాలను వినియోగిస్తారు. అంతేకాదు, ఈ చేప రెక్కలను ప్రత్యేక పదార్థాల ప్రాసెసింగ్కు ఉపయోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. అరుదైన జీవి కావడంతో పాటు బహుళ ఉపయోగాలు ఉండటంతో కచిడి చేపలు మత్స్యకారులకు నిజంగా బంగారం లాంటి వేటగా మారాయి. అందుకే పండుగ వేళ చిక్కిన ఈ గోల్డెన్ ఫిష్లు అనకాపల్లి తీరంలో ప్రత్యేక చర్చకు దారి తీశాయి.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications