దోమలపై డ్రోన్ లతో యుద్ధం...సమస్యకు పరిపూర్ణ పరిష్కారం:సిఎం చంద్రబాబు
విశాఖపట్టణం: రాష్ట్రంలో దోమల్ని నివారించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సవాల్ గా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో 'ఆరోగ్య ఉత్సవం' ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో దోమల నివారణకు పరిపూర్ణ పరిష్కారాన్ని చూపెడతామని చెప్పారు. దీనికోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని తేనున్నామని, తద్వారా అనేక వ్యాధులకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణలో భాగంగా డ్రోన్లను ఉపయోగించే పద్ధతుల్నీ అనుసరించనున్నట్లు సిఎం చంద్రబాబు వివరించారు.

డ్రోన్ ద్వారా నగరంలో దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల వివరాలు సేకరించడానికి డ్రోన్లను వినియోగించనున్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మారుమూల పల్లెలకూ ఆధునాతన వైద్య సేవలందేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చంద్రబాబు చెప్పారు.
విశాఖపట్నంలో ఆరోగ్యశాఖ, మెడ్టెక్ జోన్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా జరుగుతున్న 'ఆరోగ్య ఉత్సవం' ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ఈ సందర్భంగా 5 కొత్త పథకాల్ని ప్రారంభించారు. ఈ- సబ్సెంటర్లు, ఆర్ఎఫ్ఐడీ, ముఖ్యమంత్రి బాల సురక్ష యోజన పథకాల్ని ప్రారంభించడంతోపాటు ఉచిత డయాలసిస్ కేంద్రాలను, ఏపీ మెడికల్ రీహాబిలిటేషన్ టూరిజంను సిఎం చంద్రబాబు ఇదే వేదికపై ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టెలీ మెడిసిన్ పద్దతి విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వసతిని కల్పిస్తున్నామని...దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టెలీ మెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గూగుల్ సాంకేతికతతో ఒక గ్రామం నుంచి 20 కి.మీ. దూరం వరకూ ఎలాంటి తీగల్లేకుండా కేవలం బ్యాండ్విడ్త్ ద్వారానే టెలీ మెడిసిన్ సేవలు అందేలా చేస్తున్నామని చెప్పారు.
3 ఐటీడీఏల్లో 40 సబ్సెంటర్లను ఈ- సబ్సెంటర్లుగా మార్చామని...ఆయా కేంద్రాలకు రోగులొచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులు మాట్లాడతారని చంద్రబాబు వివరించారు. ఆన్లైన్లో మందుల వివరాలు నమోదు చేయడం...వెండింగ్ మిషన్ ద్వారా ఆటోమేటిక్గా మందులు తీసుకునే విధానం కూడా అమలులోకి తెచ్చామని...గురువారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications