సినీ నటుడు, టిడిపి నేత మురళీమోహన్ అరెస్టు
ఏలూరు: తెలుగు సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీ మోహన్ను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 29వ తేదీన అనుమతి లేకుండా ద్వారకా తిరుమలలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించినందుకు ఆయన ద్వారకా తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. మురళీ మోహన్తో పాటు టిడిపి జెడ్పీటిసి అభ్యర్థి లక్ష్మీరమణిపై కూడా కేసు నమోదు చేసారు. వీరిి భీమడోలు కోర్టులో హాజరు పరిచారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోకసభ సీటు నుంచి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రసు అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.
ఈసారి రాజమండ్రి సీటును నుంచి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. దాంతో ఆయన క్రమం తప్పకుండా ఎల్లవేళలా రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications