కారులో మంటలు: భూమా కొడుక్కి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి తనయుడికి బుధవారం తృటిలో ఘోర ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట వద్ద భూమా నాగిరెడ్డి తనయుడు ప్రయాణిస్తున్న కారులో ఓ సీటు కింద ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అతనితో పాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మంటలు గుర్తించిన భూమా కుమారుడు కారును ఆపి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో కారు దగ్ధమైంది. భూమా తనయుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన బేగంపేట పరిసరాల్లో జరిగింది. ప్రమాదానికి గురైన కారు నిసాన్. కారులో మంటలు రావడంతో ఫైరింజన్లకు సమాచారం అందించారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. అయితే, కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ బరిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి కన్నుమూశారు.
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications