రేణిగుంట ఎయిర్పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు: వెనక్కి వెళ్లి
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుముప్పు తృటిలో తప్పింది. ఆ సమయంలో విమానంలో సుమారు 150 మందికి వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పుు తప్పింది. ల్యాండింగ్ కావాల్సిన విమానం మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. పైలెట్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ముప్పు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
విమానాశ్రయం రన్వేపై ఫైరింజన్ బోల్తా పడటమే దీనికి కారణం. విమానం ల్యాండింగ్కు ముందు రన్వేను పరిశీలించడానికి వెళ్లిన ఫైరింజన్ బోల్తా పడింది. రన్వేకు అడ్డంగా పడింది. అదే సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఫైరింజన్ బోల్తా పడిన దృశ్యాన్ని చూసిన పైలెట్.. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను సంప్రదించారు. వారి అనుమతితో విమానాన్ని మళ్లీ బెంగళూరుకు మళ్లించారు.

ప్రస్తుతం ఈ విమానం తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టారు విమానాశ్రయం అధికారులు. బెంగళూరు- తిరుపతి విమానంతో పాటు మరో రెండు ఫ్లైట్ సర్వీసులను కూడా వెనక్కి పంపించినట్లు చెబుతున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ఫైరింజన్ బోల్తా పడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు. అతి వేగం, రన్వైపై వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ఫైరింజన్ బోల్తా పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Recommended Video
దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటనపై కాస్సేపట్లో రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఫైరింజన్ను తొలగించిన వెంటనే విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తామని అన్నారు. ఈ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన మరో రెండు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఆయిల్ సైతం రన్వేపై పడినట్లు తెలుస్తోంది. వాటిని తొలగించే పనిలో పడ్డారు గ్రౌండ్ స్టాఫ్.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications