హైద్రాబాద్లో జ్యోతిష్కుడిపై కాల్పులు, ప్రతీకారమా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్లో కాల్పుల కలకలం చెలరేగింది. నాగరాజు అనే జ్యోతిష్కుడి పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులు జింకల బావి వద్ద మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో జ్యోతిష్కుడు నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దుండగులు బైక్ పైన పరారయ్యారు.
రియల్ ఎస్టేట్, పాతకక్షలే కారణం

నాగరాజు పైన కాల్పులకు పాత కక్షలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఏలూరు హైవై పైన పినకడిమి వద్ద జరిగిన ఓ హత్య కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. ఓ థియేటర్ యజమాని దుర్గారావు హత్య కేసులో పదిమంది నిందితులుగా ఉన్నారు.
వారిలో నాగరాజు ఒకరు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. కాగా, పాతకక్షలు, రియల్ ఎస్టేట్ మధ్య గొడవల కారణంగా ఈ గొడవల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతి చెందారు. కాగా, నాగరాజు గత కొంతకాలంగా జ్యోతిష్కుడి పేరుతో అజ్ఞాతంలో ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications