కూర రాజన్న సహా ఐదుగురు నక్సల్స్ అరెస్టు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఐదుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ (ఎంఎల్) జనశక్తి అగ్రనేత కూర రాజన్న ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయనతో పాటు మరో నలుగురిని గత అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఓ గ్రామంలో కూరరాజన్న మరో నలుగురు జనశక్తి సానుభూతిపరులతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన కూరరాజన్న సీపీఐఎమ్ఎల్ జనశక్తిలో సీనియర్ నేతగా ఉన్నాడు. జిల్లాలో జనశక్తి ఎదుగుదలలో రాజన్న కీలక పాత్ర పోషించాడు.

కూర రాజన్నతో పోలీసుల అదుపులో ఉన్న మరో నలుగురిలో జనశక్తిలో కీలకమైన వ్యక్తిగా పేరొందిన పోతన ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల బనగానపల్లిలో జనశక్తి నక్సల్స్కు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పోతన హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
మిగిలిన ముగ్గురు జనశక్తి సానుభూతిపరులుగా తెలుస్తోంది. బనగానపల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు జనశక్తి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈనేపథ్యంలోనే కరూలులోని ఓ గ్రామంలో సమావేశమైన సీపీఐఎమ్ఎల్ జనశక్తికి చెందిన ఐదుగురు నక్సల్స్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications