Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కర్ణాటక అస్త్రం: హిందూపురంలో బాలయ్య ఉక్కిరిబిక్కిరి

Balakrishna: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా రెండు లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.

సమ ప్రాధాన్యత: ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

Former BJP MP J Shantha will set to contest from Hindupur Lok Sabha as YSRCPs candidate

ఆసక్తి కలిగించే అభ్యర్థి: ఈ జాబితాలో ఆసక్తి కలిగించే పేరు జొలదరాశి శాంత. వైసీపీ అభ్యర్థిగా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మరోసారి అవకాశం కల్పించలేదు జగన్. ఆయనకు బదులుగా జే శాంతను బరిలో దింపారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు పెద్దగా వినిపించని పేరు ఇది. రెండో జాబితా విడుదల కావడానికి ఓ మూడు గంటలు ముందే ఆమె వైసీపీలో చేరారు.

ఎవరీ శాంత: జే శాంత.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు. కర్ణాటక మాజీ మంత్రి బీ శ్రీరాములు సోదరి. 2009 నాటి ఎన్నికల్లో బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

హిందూపురంలో ఇద్దరూ మహిళలే: లోక్‌సభ స్థానం నుంచి శాంతను బరిలోకి దింపడం అనూహ్య పరిణామంగా భావిస్తోన్నారు. అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ స్థానాల నుంచి మహిళా అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీకి నిలిపినట్టయింది. వైసీపీ నాయకురాలు టీఎన్ దీపిక.. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

Former BJP MP J Shantha will set to contest from Hindupur Lok Sabha as YSRCPs candidate

బాలయ్య ఇరకాటం: వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఇద్దరూ మహిళా అభ్యర్థులనే బరిలోకి దించిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా ఈ రెండుచోట్లా మహిళా అభ్యర్థులు పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+